మహత్తు కల్గిన వటవృక్షం (మర్రిచెట్టు) కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము పాలసముద్రం మండలం, రాచపాళ్యం గ్రామంలో వెలసింది. ఈ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి ఇప్పుడు సుమారు మూడు ఎకరముల విస్తీర్ణములో విస్తరించి యున్నది. ఇంతటి ఉన్నతమైన, ఉత్కృష్టమైన, గొప్ప చరిత్ర గల ఈ వృక్షపు నీడలో ఎన్నో సంవత్సరాలకు పూర్వము మహిమాన్వితమైన, భక్తవత్సలుడు, ధీనజన రక్షకుడు, కోరిన కోర్కెలను ప్రసాదించే మహిమ గల్గిన - శ్రీశ్రీ బాలగురునాధ స్వామి వెలసియున్నాడు. ఈ స్వామి ఆకారములో పంచమూర్తులు కల్గియున్నాడు. ఈ స్వామి ఆకారములో పంచమూర్తులు కల్గియున్నారు. సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు విఘ్నరాజాధిపతి విఘ్నేశ్వరుడు, ఆరోగ్యప్రధాతయైన దేవాసేనాని శ్రీ సుబ్రమణ్యస్వామి. వీరి ప్రతిమలు "6" అడుగుల కల్గిన ఏకశిలా విగ్రహంలా ప్రతిష్ఠింపబడ్డారు. ఇటువంటి పంచమూర్తులు కల్గిన మహిమగల ఏకశిలా విగ్రహం మరెక్కడనూ మనకు కానరాదు.